🔴 పగో : భీమవరం : ది డెస్క్ :
పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ భీమవరం మావుళ్లమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధమహాలక్ష్మి నగేష్, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు తదితరులు జేసీకి శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

