🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

ఆoధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ ఒ ప్రకటనలో.. గత ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల నిర్వీర్యమైన వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువనేత రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ లకు ఎంపీ అభినందనలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి తమ మద్దతును అందిస్తూ, కూటమి ప్రభుత్వానికి నిరంతరం సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ప్రజల విశ్వాసంతో ప్రారంభమైన ఈ ప్రయాణం మరిన్ని విజయాలు సాధించి, స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని, ముఖ్యమంత్రి స్పూర్తితో ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి చిత్తశుద్ధితో తన కృషిని కొనసాగిస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

