🔴 పోలవరం జిల్లా : చింతూరు : ది డెస్క్ :
ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడానికి స్వర్ణ గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని, గిరిజన ప్రాంత ఆ లక్ష్యం నెరవేరాలంటే గ్రామ సచివాలయం సిబ్బంది నిబద్దతో పనిచేయాలని జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. బుధవారం స్థానిక గ్రామ సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేసిన శ్రీనివాస విశ్వనాధ్ ప్రజలకు అందుతున్న సేవల పురోగతిపై ఆరాతీసి సమీక్షా నిర్వహించారు. సందర్బంగా మనమిత్ర యాప్ ద్వారా అందుతున్న సేవలపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం మిస్సింగ్ డేటా, సిటిజెన్ ఈ.కె.వై.సి, పాఠశాలలు తనిఖీ, సిబ్బంది హాజరు తదితర అంశాలుపై సమీక్షా నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేసారు.

జలధార కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ద :
జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశాలు మేరకు అధికారులు, త్రాగునీటి సంఘాల సభ్యుల సమాన్వయంతో పోలవరం జిల్లాలో జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన, మండల స్థాయిలో ఎంపీడీఓ అధ్యక్షతన అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పడిందని, భూగర్భ జలాలు పెంచే విదంగా వందరోజులు ప్రణాళికలో భాగంగా గ్రామాలలో ఇంజనీరింగ్ అధికారులు, నీటి సంఘ సభ్యులు పనులు గుర్తించి కలెక్టర్ ఆమోదనికి పంపాలని సూచించారు.
దీనికోసం వందరోజులు ప్రణాళిక అమలు కోసం ప్రభుత్వం జిఓ 10 విడుదల చేసిందని అన్నారు. దానిలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు పనులు గుర్తింపు, ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 20 వరకు గుర్తించిన పనులు ఆమోదం, ఏప్రిల్ 21 నుంచి 09 జులై అంటే 80 రోజులలో ఆమోదించిన పనులను గ్రామాలలో అధికారులు పనులు చేపట్టి వర్షాకాలం ముందు పూర్తి చేసి భూగర్భ జలాలను పెంచాలని అన్నారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు ప్రతి నీటిబొట్టును వినియోగంలోకి తీసుకురావాలని దానిలో భాగంగా చెరువులు, కాలువలు పునరుద్దరణ తదితర పనులు చేపట్టానున్నామని జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.
కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ జి.మోహన్, సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.

