🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
కార్యకర్తలు ఇప్పటి నుంచే సమరానికి సిద్ధం కావాలి
➖ఎమ్మెల్యే సౌమ్య
స్థానిక సమరానికి కూటమి సన్నద్ధం
కార్యకర్తలే కూటమి బలం.. విజయమే లక్ష్యం
కూటమి విజయానికి సమష్టిగా కదలాలి
ఎన్నికల సమరానికి కూటమి శ్రేణులు రెడీ
క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి
స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పనిచేయాలి
కూటమి కార్యకర్తలకు ఎమ్మెల్యే సౌమ్య దిశానిర్దేశం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. నందిగామ పట్టణంలో కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, నాయకులు-కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెంచుకోవాలని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సౌమ్య సూచించారు. కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

