The Desk…Eluru : ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి పైనే దృష్టి – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి పైనే దృష్టి – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

  • ఏలూరు అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంది.
  • పెండింగ్ పనులన్నీ త్వరలోనే పూర్తి.
  • ఏలూరు- జంగారెడ్డిగూడెం రోడ్డు, కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైన్ పనులకు త్వరలోనే ఆమోదం.
  • పామాయిల్ రైతులు, జ్యూట్ మిల్లు కార్మికుల సమస్య త్వరలో పరిష్కారం.
  • తప్పిపోయిన వ్యక్తుల కేసుల దర్యాప్తు కోసం MIB బిల్లు.
  • కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు CSR ఫండ్స్ తో అభివృద్ధి పరుగులు.

🔴‎ ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

ఏలూరు పార్లమెంటు పరిధిలో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పనుల సాధనకు, కొత్త అభివృద్ధి పనుల మంజూరుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటూనే సమయం దొరికినప్పుడల్లా వివిధ శాఖల మంత్రులను కలుస్తూ  ఏలూరు పరిధిలోని పెండింగ్ పనులను, అర్జీలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువస్తున్నారు.

ఈ సందర్భంగా బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గత పదిరోజులుగా ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొంటూ ఏలూరు పార్లమెంట్ కు సంబంధించిన వివిధ పెండింగ్ పనులను, కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయాలను వివరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి  ఏలూరు- జంగారెడ్డిగూడెం రోడ్డు జాతీయ రహదారిగా విస్తరించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలియజేసారు.

ఈ రహదారిపై ప్రధానమంత్రి కి కూడా లేఖ రాసినట్టు, త్వరలో ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని కలిసి  ఏలూరు- జంగారెడ్డిగూడెం రహదారిపై మాట్లాడానున్నట్లు ఎంపీ వెల్లడించారు.  అదేవిధంగా కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైన్ డీపీఆర్ ఆమోదించి త్వరగా పనులు మొదలు పెట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి విజ్ఞప్తి చేయగా, వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ రైల్వే లైన్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రమంత్రి తెలియచేసినట్లు చెప్పారు.

ఏలూరు జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్న పామాయిల్ రైతుల ప్రయోజనార్థం ముడి పామాయిల్ పై ఇంపోర్ట్ డ్యూటీని మరో 10 శాతం పెంచాల్సిందిగా కేంద్ర వాణిజ్య మంత్రిని కోరినట్లు తెలిపారు.  మూతపడిన ఏలూరు, కొత్తూరులోని జ్యూట్ మిల్లు ఉద్యోగులు ఇటీవల తనని కలిసి ఈఎస్ఐ నుంచి రావాల్సిన ప్రయోజనాలు కోసం ఇచ్చిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్లగా మంత్రికి సానుకూలంగా స్పందించారని త్వరలోనే వారి బకాయిలు విడుదల అవకాశం ఉందని ఎంపీ తెలిపారు.

లోక్ సభలో మిస్సింగ్ ఇండివిడ్యువల్ల్స్ బ్యూరో బిల్లును  ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో ఏటా కొన్ని లక్షల మంది మహిళలు, చిన్నారులు తప్పిపోతున్నారని, ‎మిస్సింగ్ అయిన బాలికలు, మహిళలను వేగంగా గుర్తించకపోతే మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీకి గురయ్యే అవకాశం ఉన్న కారణంగా ఇలా ‎తప్పిపోయిన వ్యక్తులను గుర్తించేందుకు, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బ్యూరో అవసరం ఎంతైనా ఉందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.

దీనిని దృష్టిలో ఉంచుకునే తెలుగుదేశం పార్టీ తరపున తాను లోక్ సభలో ప్రైవేటు బిల్లుగా మిస్సింగ్ ఇండివిడ్యువల్ల్స్ బ్యూరో (MIB) బిల్లుని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిపై పార్లమెంట్లో చర్చ గారికి బిల్లు రూపొందించడం జరిగితే దేశంలో మహిళలు చిన్నారులకు మరింత భద్రత లభిస్తుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.

తాజాగా ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఓఎన్జీసీ సంస్థ నుంచి 2.5 కోట్ల నిధులు తీసుకువచ్చామని చెప్పారు. అదేవిధంగా గ్రామాలలో స్మశాన వాటికలకు స్థలం కొరత పెద్ద సమస్యగా మారిందని, ఇటీవల అనేక గ్రామాల నుంచి తనకు వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, ఉపాధి హామీ నిధులు తీసుకువచ్చి గ్రామాలలో స్మశానవాటికల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ముందస్తుగా 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపిన ఎంపీ, త్వరలో వీటి పనులు మొదలు పెడుతున్నామని తెలిపారు. సీసీ రోడ్లపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు.

‎తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ తన పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎవరైనా  ఏలూరులోని తన కార్యాలయ సిబ్బందిని కలిసి తమ సమస్యలను తెలియచేయవచ్చని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను, ప్రాజెక్టులను సాధించి ఏలూరు పార్లమెంటును అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ప్రజల మద్దతుతో ఏలూరు పార్లమెంటును నెంబర్ 1గా నిలపగలనన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

‎త్వరలో మరో నాలుగు ఆర్వోబీలు :

ఇప్పటికే మంజూరైన 13 ఆర్వోబీలకు తోడు మరో నాలుగు ఆర్వోబీ/ఆర్యూబీలు త్వరలో రాబోతున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు సందర్భంగా లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ సమాధానం ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. అటపాక – వరాహపట్నం (LC- 83),  వదర్లపాడు – వరాహపట్నం (LC- 86), పల్లెవాడ- రామవరం (LC- 91) ఆర్వోబీలపై డీపీఆర్ తయారీ పనులు జరుగుతున్నాయన్న కేంద్ర మంత్రి కొక్కెరపాడు రైస్ మిల్లు (LC -)  వద్ద  నిర్మించే ఆర్వోబీకు ఇప్పటికే అనుమతి మంజూరు చేసినట్టు తెలిపారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 11,686 కోట్లతో మొత్తం 316 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు అండర్ బ్రిడ్జిలు అనుమతులు మంజూరైనట్లు కేంద్రం తెలిపిందన్నారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏ రైల్వే గేటు వద్దా ప్రజలు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.