The Desk…Duggirala : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర..వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత

The Desk…Duggirala : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర..వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత

🔴 ఏలూరు జిల్లా : దెందులూరు మండలం : దుగ్గిరాల : ది డెస్క్ :

దుగ్గిరాల గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ” కార్యక్రమములో భాగంగా..

వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాలని, ప్రతి దినం ఉదయమే దీని విషయమై కొంత సమయం కేటాయించాలని..వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కలిగి , బహిరంగ మలవిసర్జన నిర్మూలించే దిశగా.. ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో దుగ్గిరాల సర్పంచ్ గుంజా క్రీస్తుమణి, గుంజా మధు ,వైస్ సర్పంచ్ చింతమనేని శివగోపాల్ , పంచాయితీ కార్యదర్శి రాజా సాయికృష్ణ , తెదేపా నాయకులు చింతమనేని సతీష్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.