కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.01.11.2025 శనివారం నాడు ఉదయం 09:00 గంటలకు పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(కమ్యూనిటీ హాల్) నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తెలియజేశారు..
ఈ జాబ్ మేళాలో, జపనీస్ MNC – NS ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెరికన్ MNC – కోల్గేట్ పల్మోలివ్ లిమిటెడ్, ఫాక్స్కాన్ MNC, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, PVS లాబొరేటరీస్ లిమిటెడ్, సంతోష్ ఆటోమోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసి, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, వరుణ్ గ్రూప్, శ్రీనివాస ట్రాక్టర్స్(ఎస్కార్ట్స్ లిమిటెడ్)వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ తెలిపారు.
ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసి పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, నవంబర్ 1న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 80743 70846, 96767 08041 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Sd/-
డి. విక్టర్ బాబు
డిజిగ్నేటెడ్ ఆఫీసర్/ఉపాధి కల్పన అధికారి
కృష్ణా జిల్లా
dr పి.నరేష్ కుమార్
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి
కృష్ణా జిల్లా

