NTR జిల్లా : విజయవాడ : ది డెస్క్ :
కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ 1వ తేది నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీకి సర్వం సిద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
యం డి యు విధానం అమలులో ఉన్నపుడు ఈ పోస్లో ఉన్న సాఫ్ట్వేర్ను తొలగించి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపోందించిన సాఫ్ట్వేరు క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నెంబరు 218ను గురువారం పౌరసరఫరాశాఖ కమీషనర్ సౌరబ్ తో కలిసి సందర్శించారు.
ఈపోస్లో లాగిన్ నుండి కార్డు నెంబరు ఎంటర్ అయ్యే విధానం కార్డుదారుని వేలిముద్ర, కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానం పరిశీలిం చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో యుండియు వాహనం ఎపుడు వస్తుందో వెళుతుందో తెలియని దుస్తితి ఉందని దీంతో కార్డుదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉందని ఇపుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని చె ప్పారు. నెలలో ఒకటో తేది నుండి 15వ తేది వరకు ఉదయం 8 నుండి మద్యహ్నం 12 వరకు సాయంత్రం నాలుగు నుండి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని చెప్పారు.
65 సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యభర్తలు ఇద్దరు వృ ద్దులైన వారి జాబితాలు రేషన్ షాపుల వారికిగా సిద్ధం చేశామని వారికి 1 నుండి 5వ తేదిలోగా డీలర్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు.
ఇల్లు మారి వేరే ప్రాం తాలకు వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొం దవచ్చని చెప్పారు. రేషన్ దుకాణాలలో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికోత్తయాప్ను రూపొందించిందని చెప్పారు. ఈ యాప్లో డీలర్ వివరాలు ఫోటోతో సహా వస్తాయన్నారు.
యంఎల్ఎస్ పాయంట్ నుండి సరుకు ఎంత వచ్చింది. కార్డుదారులకు ఎంత పంపిణీ చేశారనే వివరాలు, రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా వెంటనే ఈ యాప్ ద్వారా తెలుస్తుందన్నారు.