🥛 ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం మార్కెట్లో బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనసేన పార్టీ యువనాయకుడు బొలిశెట్టి రాజేష్ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ..బొలిశెట్టి సేవాసమితి చేసే సేవ అభినందనీయమని సేవాసమితి పెట్టిన అతి తక్కువ రోజులకే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంలో ముందున్నారని.. వేసవికాలంలో దాహాన్ని తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, వేసవి కాలంలో మరిన్ని చలివేంద్రాలు ప్రారంభించాలని, అనేక సేవాసమితిలు ముందడుగు వేసి ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలని, మా నాన్న పేరు మీద పెట్టిన బొలిశెట్టి సేవాసమితి ఆర్గనైజింగ్ కమిటీవారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
లింగంపల్లి శ్రీనివాస్ కు వారి బృందానికి నా కృతజ్ఞతలు. నన్ను కూడా ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో తోట రాజా మరియు జనసేన కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు