ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని దాకరం గ్రామానికి చెందిన వృద్ధురాలు కాటే రాజమ్మ (90) అనరోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. మృతి చెందిన పేద వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుండేది.

ముదినేపల్లికీ చెందిన ప్రముఖ ప్రయివేటు వైద్యుడు మనోజ్ కుమార్తె, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఆంబుల వైష్ణవి కి విషయం తెలియడంతో తన తండ్రి ద్వారా పేద వృద్ధురాలు రాజమ్మ దహన సంస్కారాలు నిమిత్తం రూ.5 వేలు అందజేశారు. సాయం అందించిన డా.మనోజ్, కుమార్తె వైష్ణవినీ స్థానికులు అభినందించారు.