The Desk…Vizag : కార్డేలియా క్రూజ్‌ షిప్‌ విశాఖపట్నం పోర్టుకు త్వరలో…!!

The Desk…Vizag : కార్డేలియా క్రూజ్‌ షిప్‌ విశాఖపట్నం పోర్టుకు త్వరలో…!!

  • వైజాగ్ పోర్ట్‌కు క్రూజ్‌ షిప్
  • ముహూర్తం ఫిక్స్

🔴 విశాఖ : THE DESK NEWS :

కార్డేలియా క్రూజ్‌ షిప్‌ విశాఖపట్నం పోర్టుకు రానుంది. పోర్టు యాజమాన్యం కృషి ఫలితంగా ఈ షిప్‌ పుదుచ్చేరి, చెన్నై- విశాఖపట్నం మధ్య ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. జీఏసీ షిప్పింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్వీస్‌కు షిప్పింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది.

ఈమేరకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శి టి.వేణు గోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.సకల హంగులతో విశాఖ క్రూజ్‌ టెర్మినల్‌విశాఖను అంతర్జాతీయ పర్యాటక యవనికపై నిలిపే క్రూజ్‌ టెర్మినల్‌ పూర్తి హంగులతో సిద్ధమైంది.

వైజాగ్‌ ఇంటర్నేషనల్‌ క్రూజ్‌ టెర్మినల్‌ (ఐసీటీ)గా పిలిచే దీన్ని రూ.96.05 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ (రూ.38.50 కోట్లు), విశాఖ పోర్టు ట్రస్ట్‌)రూ.57.55 కోట్లతో సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని నౌక ఆకారంలో, రెండువేల మందిని తీసుకెళ్లగల సామర్థ్యం గల క్రూజ్‌లు నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. కస్టమ్స్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సేవా కౌంటర్లు, రిటైల్‌ అవుట్‌లెట్‌లు, డ్యూటీఫ్రీ షాపులు, ఫుడ్‌ కోర్టులు, లాంజ్‌లతో టెర్మినల్‌ సిద్ధమైంది.

2024 ఏప్రిల్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ క్రూజ్‌ షిప్‌ ‘ద వరల్డ్‌’ ఇక్కడికి వచ్చింది.

ఇది విశాఖ నగర సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు అత్యంత సమీపంగా ఉండటంతో అంతర్జాతీయ పర్యాటకులకు అత్యంత అనువుగా ఉంటుంది.

www.thedesknews.net