🔴 TG : మెదక్ జిల్లా : మాసాయిపేట మండలం :
రామంతపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది..ఈనెల 8వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మతిస్థిమితం లేని ఓ మహిళ.. రోడ్డుపై వెళ్తుండగా అడ్డగించి.. ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మద్యం మత్తులో ఉన్న యువకులకు రోడ్డుపై వెళ్తున్న ఆమె కనిపించేసరికి.. తీసుకెళ్లి గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెనకాల, ఒకరి తరవాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
వారు ఈ దారుణానికి పాల్పడిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్న విషయం నిందితులు గుర్తించలేదు. కాగా గ్రామంలో 10వ తేదీన స్వామి అనే వ్యక్తి బర్రె తప్పిపోగా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బర్రె మిస్సింగ్ కేసు విషయంలో పోలీసులు స్థానిక సీసీ కెమెరాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి జిల్లా బాల్కొండకు చెందిన మతిస్థిమితం లేని సుమారు 30 సంవత్సరాల మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు మతిస్థిమితం లేని మహిళను మెదక్ భరోసా కేంద్రానికి తరలించారు.