The Desk… Amaravati : శాస‌న‌స‌భ‌లో మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ కు సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంశ

The Desk… Amaravati : శాస‌న‌స‌భ‌లో మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ కు సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంశ

  • దీపం ప‌థ‌కాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్నార‌ని అభినంద‌న‌
  • రేష‌న్‌, ఆధార్ కార్డుదారులంద‌రూ అర్హులేన‌ని ప్ర‌క‌ట‌న‌

అమ‌రావ‌తి : ఏపి అసెంబ్లీ : THE DESK :

దీపం ప‌థ‌కం-2ను రాష్ట్ర ఆహార మ‌రియు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌మ‌ర్ధంవంతంగా అమ‌లు చేస్తున్నార‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంసించారు.

బుధ‌వారం జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల్లో సీఎం చంద్ర‌బాబు సంక్షేమ ప‌థ‌కాలు గురించి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ… గ‌తంలో మ‌హారాష్ట్ర‌లో రామ్‌నాయ‌క్ అనే కేంద్ర మంత్రిని, ప్ర‌ధాని వాజ్‌పెయ్‌ని మెప్పించి ఆ రోజుల్లోనే దీపం ప‌థ‌కంను ఇంటింటికీ అమ‌లు చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు.

ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో చెప్పాం. ఆ దిశ‌గానే ముందుకు వెళుతున్నామ‌న్నారు. కొంద‌రు తెలియ‌నివాళ్లు గ్యాస్ ఎక్క‌డిచ్చార‌ని మాట్లాడుతున్నార‌ని.. ఇది క్యాష్ కాదు చేతికివ్వ‌డానికి.. గ్యాస్ అని చ‌లోక్తి విసిరారు.

కేవ‌లం రేష‌న్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగానే గ్యాస్ బుకింగ్ చేసుకునే వారంద‌రికీ ఉచితంగానే ఇస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికైనా వాస్త‌వం తెలుసుకుని విమ‌ర్శ‌లు మానుకోవాలని బాబు హెచ్చరించారు.