NTR జిల్లా : Vijayawada : THE DESK :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము లో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం జరిగిందని ఆలయ ఈవో కె.ఎస్ రామారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
15 రోజులకు నగదు : రూ. 82,03,392/- లు,
కానుకల రూపములో – బంగారం 145 గ్రాములు, వెండి 1.870 kg భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.
ఆన్లైన్ లో e – హుండీ ద్వారా రూ.1,03,034/-లు భక్తులు చెల్లించుకున్నారన్నారు.
USA – 136 డాలర్లు, ఇంగ్లాండ్ – 20 Changes, కేనెడా – 40 డాలర్లు, కువైట్ – 0.25 దినార్స్, స్కోట్లాండ్ – 10 పౌండ్లు, హోంకాంగ్ – 20 డాలర్ లు, కతార్ – 51 రియాల్స్ విదేశీ కరెన్సీ అందులో ఉన్నాయన్నారు.
హుండీ లెక్కింపు లో ఆలయ డీప్యూటీ ఈవో లీలా కుమార్, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు, ఆలయ సిబ్బంది, SPF, I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు పాల్గొన్నారు.