The Desk…Mudinepalli : అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు..

The Desk…Mudinepalli : అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు..

  • ఐటిఐ కళాశాల యాజమాన్యం మేము సైతం అంటూ..

ఏలూరు జిల్లా : కైకలూరు నియోజకవర్గం : ముదినేపల్లి మండలం : ది డెస్క్ :

అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమంలో భాగంగా.. ముదినేపల్లి గ్రామంలోని ఐటిఐ నందు ఐటిఐ ప్రిన్సిపాల్ కూనపరెడ్డి సత్యనారాయణ మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొని.. అమరావతి నిర్మాణంలో భాగంగా భాగస్వామ్యులగుటకై విద్యార్థులు ఒక్కొక్కరు 116/- రూపాయలు ఫోన్ పే రూపంలో CRDA అకౌంట్ కి చెల్లించారు.

సందర్భంగా అంబుల వైష్ణవి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ… అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం… వైష్ణవి పిలుపుమేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగస్తులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రతి ఒక్కరూ స్పందించి వారి యొక్క స్తోమత కొలది కనీసం 116 రూపాయలు చెల్లిస్తున్న విధానానికి సంతోషం వ్యక్తం చేస్తూ .. దీనిలో అందరూ పాలిభాగస్తులై ఉండాలని, మన అమరావతి కలల రాజధాని నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మించుకొందామని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ముదినేపల్లి ఐటిఐ ప్రిన్సిపాల్ మరియు కళాశాల సిబ్బందిని డాక్టర్ మనోజ్ సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.