The Desk…Duggirala : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర “స్వచ్ఛమైన గాలి” కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

The Desk…Duggirala : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర “స్వచ్ఛమైన గాలి” కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

🔴 ఏలూరు జిల్లా : దెందులూరు మండలం : దుగ్గిరాల : ది డెస్క్ :

దుగ్గిరాల గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమములో భాగంగా.. క్లీన్ ఎయిర్ ..వాయు కాలుష్యం నివారణ పై ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు…కాలుష్యం వలన వ్యాప్తి చెందే వ్యాధుల గురించి తెలియజేస్తూ. పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలని..పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని..ఈ రోజు ” క్లీన్ ఎయిర్” స్వచ్ఛ గాలి థీమ్ తో కార్యక్రమాన్ని దుగ్గిరాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, మొక్కలు నాటితే సరిపోదని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు.

అలాగే ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగానికి, నడకకు ప్రాధాన్యతను ఇవ్వాలని దీనివలన పర్యావరణ పరిరక్షణకు, మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం అన్నారు. వాతావరణ కాలుష్యం ప్రజలు ఆరోగ్యంపై ఏటువంటి దుష్ప్రభావం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. చిన్న చిన్న పనులకు సైకిల్ వినియోగం, ప్రతిరోజు నడక, యోగా, వ్యాయామం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

పరిశ్రమలు యూనిట్లలో వాతావరణం కలుషితం కాకుండా తీసుకోవలసిన చర్యలపై ఆ యాజమాన్యాలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యర్థ పదార్థాలను కాల్చడం ద్వారా వాతావరణం కలుషితం అవుతుందన్న విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సోలార్ యూనిట్లు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కట్టెలు పొయ్యి స్థానంలో ఎల్పిజి వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు.

దీపావళి రోజున వాతావరణం కలుషితం చేయని క్రాకర్స్ ను మాత్రమే వాడాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించి గ్రామాన్ని ప్రథమ స్థానంలో ఉండేలా అందరూ సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, దుగ్గిరాల సర్పంచ్ గుంజా క్రీస్తుమణి, గుంజా మధు ,వైస్ సర్పంచ్ చింతమనేని శివగోపాల్ , పంచాయితీ కార్యదర్శి రాజా సాయికృష్ణ , తెదేపా నాయకులు చింతమనేని సతీష్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.