🔴 కడప జిల్లా : ప్రొద్దుటూరు : ది డెస్క్ :
కొత్త కమిషనర్ ఎంట్రీతో మారిన మున్సిపాలిటీ తీరు..!
ఫిర్యాదు అందగానే క్షేత్రస్థాయిలో చర్యలు
ప్రొద్దుటూరులో కమిషనర్ వేగానికి ప్రజల ప్రశంసలు
నత్తనడకకు బ్రేక్..!
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొత్త కమిషనర్ స్పీడ్
మాటల్లో కాదు… చేతల్లో చూపిన కమిషనర్..!
మొదటి రోజే ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం
పట్టాలెక్కిన ప్రొద్దుటూరు పాలన..!
ప్రజా సమస్యలపై కొత్త కమిషనర్ దూకుడు
ప్రజా ఫిర్యాదుకు గంటల్లోనే పరిష్కారం..!
కొత్త కమిషనర్ మార్క్ పరిపాలన – మార్పు మొదలైంది..!
మున్సిపాలిటీలో కొత్త కమిషనర్ స్పెషల్ డ్రైవ్

ఎన్నో రోజులుగా ప్రజా సమస్యల పరిష్కారంలో నత్తనడకన సాగిన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కొత్త ఊపు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల నూతన మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండేలా ‘కమిషనర్తో ముఖాముఖి’ కార్యక్రమాన్ని ప్రారంభించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.
బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన కమిషనర్, ప్రతి సమస్యను నిర్దిష్ట గడువులో పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఫిర్యాదు.. వెంటనే పరిష్కారం :
స్థానిక గాంధీ రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో నాలుగు నెలలుగా డ్రెయినేజీ గ్రిల్ దెబ్బతిని ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ‘ముఖాముఖి’లో ఫిర్యాదు అందింది. దీనిపై కమిషనర్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అదే రోజు రాత్రి అత్యవసరంగా కొత్త గ్రిల్ ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు.
ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యం :
దెబ్బతిన్న గ్రిల్ కారణంగా పలువురు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొన్నప్పటికీ గత కొంతకాలంగా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. కొత్త కమిషనర్ మాత్రం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వేగంగా చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లో పెరిగిన ఆశాభావం :
గతంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రెయిన్లు, పారిశుధ్యం, వీధిదీపాలు తదితర సమస్యల పరిష్కారానికి కూడా ఇదే తరహాలో చర్యలు కొనసాగుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలనతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందనే విశ్వాసాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

