The Desk…Yetapaaka : అల్లూరి జిల్లాలో అనుకోని ఘటన… నడిరోడ్డుపై మృతదేహాన్ని వదిలేసి పరార్

The Desk…Yetapaaka : అల్లూరి జిల్లాలో అనుకోని ఘటన… నడిరోడ్డుపై మృతదేహాన్ని వదిలేసి పరార్

🔴 అల్లూరి జిల్లా : ఎటపాక మండలం : ది డెస్క్ :

    • అంతిమయాత్రలో అపశృతి
    • తేనెటీగల దాడిలో తుర్రుమన్న బంధువులు

    గన్నేరు కొయ్యపాడులో కొప్పుల పల్లాయమ్మ (86) మృతి చెందడంతో శుక్రవారం ఉదయం బంధువులు అంతిమ యాత్ర నిర్వహిస్తూ బాణాసంచా కాల్చడంతో… టపాకాయ చెట్టుపై ఉన్న తేనెతుట్టు ఫై పడటంతో తేనెటీగలు – అంతిమ యాత్రలో ఉన్న వారి వెంటపడ్డాయి.

    వారంతా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు తీయడంతో.. 40 మందిని తేనెటీగలు కుట్టాయి.

    క్షతగాత్రులను గౌరీదేవిపేట PHCకి తరలింపు. నలుగురికి భద్రాచలంలోని ప్రైవేట్ హాస్పిటల్ ICU లో చికిత్స అందిస్తున్న వైద్యులు.

    తేనెటీగలు వెళ్లాక అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం.

    www.thedesknews.net