ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :
2025–26 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు అనంతరం CMR రైస్ నిల్వ కోసం అవసరమైన స్టోరేజ్ గోడౌన్ల ముందుగానే సిద్ధం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.
సచివాలయం రెండో బ్లాక్లోని సివిల్ సప్లైస్ మంత్రి ఛాంబరులో ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షన రైస్ మిల్లర్స్ ప్రతినిధుల సమావేశం జరిగింది.
గత ఏడాది కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడంతో పాటు ధాన్యం కొనుగోలులో చరిత్ర సృష్టించిందన్నారు.
ఈ సీజన్లో పౌర సరఫరాల శాఖకు 20 లక్షల మెట్రిక్ టన్నులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 14 లక్షల మెట్రిక్ టన్నులు cmr రైస్ నిల్వ కోసం గోడౌన్లను సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
డ్రైయర్లు సౌకర్యాలు ఉన్న రైస్ మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గోడౌన్ వద్ద నిరంతర నిఘా ఉండేలా AI కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
జిల్లాల వారీగా రైస్ మిల్లర్లు 1:2 బ్యాంక్ గ్యారంటీలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇందుకు సుమారు 35 బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని తెలిపారు.
సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీ రావు, IAS పాల్గొన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై సెక్రటరీ సౌరభ్ గౌర్, IAS, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, సెక్రటరీ సూరిబాబు, నాయకులు సత్యనారాయణరాజు, వీరయ్య, లలిత శ్రీనివాస్, పట్టాభి శ్రీనివాస్, సివిల్ సప్లై అధికారులు ఉన్నారు.

