The Desk … Rampachodavaram : ఘనంగా ఉద్యోగుల సంఘం క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమం

The Desk … Rampachodavaram : ఘనంగా ఉద్యోగుల సంఘం క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమం

🔴 పోలవరం జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ :

రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు విశ్రాంతి ఉద్యోగులు, టీచర్స్, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కేతా శ్రీనివాస అన్నారు. శనివారం రాష్ట్ర కో-చైర్మన్ డ్వామా ఎపిడి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో జేఏసీ రాష్ట్ర నాయకులు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి మరియు పోలవరంజాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ రాజ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఉద్యోగ సంఘం క్యాలెండర్ ను జేఏసీ ప్రతినిధుల కోరికమేరకు పిఓ ఆవిష్కరించి అభినందనలు తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షులు కేతా శ్రీనివాస మాట్లాడుతూ..

నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో ఆదివాసీల సంక్షేమానికి, గిరిజన ప్రాంత అభివృద్ధికి ఉద్యోగ జేఏసీ కృషి చేస్తుందని అన్నారు. త్వరలో నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో నూతన కమిటీ ఏర్పాటు చేస్తామని అధ్యక్షులు కేతా శ్రీనివాస అన్నారు.

కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు బోండ్ల వరప్రసాద్, వెంకటేశ్వరావు, బి.హెచ్ మహాల్సక్ష్మి, డి.వి.బిఎస్.ఎన్ మూర్త్తి, అడ్వకేట్ చింతపర్తి రాంబాబు, బండారు శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.