🔴 ప.గో జిల్లా : పెంటపాడు మండలం : K పెంటపాడు : ది డెస్క్ :మూడవ శనివారం :

పెంటపాడు మండలం K పెంటపాడు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మూడవ శనివారం “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర “కార్యక్రమ సందర్భంగా స్పెషల్ మీటింగ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో *“సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం”* గురించి తెలియజేస్తూ..సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల కలిగే హాని గురించి అవగాహన కల్పించారు. ఈ ముప్పును అరికట్టడానికి తయారీదారులు తగిన శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.
మండలాల్లోనూ, గ్రామ పరిధిలోను బై బ్యాక్ ప్లాస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మరియు వ్యాపార వాణిజ్య దుకాణాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉపయోగం నియంత్రించాలని , గ్రామాలు పరిసర ప్రాంతాలు మండలాలు ప్లాస్టిక్ రహిత ప్రదేశాలుగా ఉండాలని ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు , సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఎంపీటీసీ ఏడుకొండలు, పెంట్లమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, జనసేన నాయకులు నరాల శెట్టి సంతోష్ ప్రభృతులు పాల్గొన్నారు.