ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
పెద్ద పాలపర్రు గ్రామంలో ఈరోజు ఉదయం రజక కుల నిరుపేద కుటుంబానికి చెందిన ఓగిరాల శివజ్యోతి ఎన్ఆర్జిఎస్ పని పథకానికి వెళ్లి పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోగా గుండెపోటుతో మరణించిందన్న మరణ వార్తను తెలుసుకున్న అంబుల వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా అంతిమ యాత్ర, మట్టి ఖర్చులకు గాను ఐదువేల రూపాయలు తక్షణ సహాయాన్ని అందించి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
మృతురాలి భర్త గత కొంతకాలంగా పక్షవాతంతో ఉన్నాడని చూసి, భాదను వ్యక్తపరచిన కుటుంబికులకు డాక్టర్ మనోజ్ భవిష్యత్తులో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారికి ధైర్యాన్ని చెప్పారు