🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమంలో భాగంగా.. ముదినేపల్లి మండలంలోని ఉప్పరగూడెంలో నాగుల చవితి సందర్భంగా.. నాగుల చవితి పండుగ ఆ గ్రామంలో ప్రసిద్ధి చెందింది మరియు ఆ గ్రామంలో వైభవంగా ఏటా జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో గ్రామస్తులు అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యులగుటకై 50 మంది116/- రూపాయలు ఫోన్ పే రూపంలో CRDA అకౌంట్ కి చెల్లించారు.

ఈ సందర్భంగా అంబుల వైష్ణవి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ… అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం… వైష్ణవి పిలుపుమేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగస్తులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రతి ఒక్కరూ స్పందించి వారి యొక్క స్తోమత కొలది కనీసం 116 రూపాయలు చెల్లిస్తున్న విధానానికి సంతోషం వ్యక్తం చేస్తూ .. దీనిలో అందరూ పాలిభాగస్తులై ఉండాలని, మన అమరావతి కలల రాజధాని నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మించుకొందామని, మన రాష్ట్రాన్ని మన రాజధాని మనమే నిర్మించుకుంటే మన పిల్లలు మన కండ్ల ఎదుటే ఉంటారని,

ఎక్కడికో సుదూర ప్రదేశాలు వెళ్ళనక్కరలేదని, అకుంఠిత పట్టుదలతో అమరావతి రాజధాని నిర్మాణానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా కష్టపడుతున్నారో, మన వంతుగా ఆయనకి సపోర్టుగా నిలిచి , ఒక్కొక్కరు 116 రూపాయలు చొప్పున చెల్లించడమే కాకుండా మన స్నేహితులతో కూడా చెప్పి , ఈ చిన్న విరాళాన్ని CRDA అకౌంట్ కు పంపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు డాక్టర్ మనోజ్ ని సన్మానించారు.

