The Desk…Mudinepalli : గురజా గ్రామంలోని శివాలయంలో పురోహితులను సన్మానించిన డాక్టర్ మనోజ్

The Desk…Mudinepalli : గురజా గ్రామంలోని శివాలయంలో పురోహితులను సన్మానించిన డాక్టర్ మనోజ్

  • అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు..
  • పురోహితుల మేముసైతం అంటూ..

🔴 ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం : ది డెస్క్ :

అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమంలో భాగంగా.. గురాజా గ్రామంలోని శివాలయం నందు .. అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యులగుటకై పురోహితులు మరియు అయ్యప్ప భక్తులు మొత్తం 40 మంది, ఒక్కొక్కరు 116/- రూపాయలు ఫోన్ పే రూపంలో CRDA అకౌంట్ కి చెల్లించారు.

సందర్భంగా అంబుల వైష్ణవి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ…అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం… వైష్ణవి పిలుపుమేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగస్తులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రతి ఒక్కరూ స్పందించి వారి యొక్క స్తోమత కొలది కనీసం 116 రూపాయలు చెల్లిస్తున్న విధానానికి సంతోషం వ్యక్తం చేస్తూ .. దీనిలో అందరూ పాలిభాగస్తులై ఉండాలని, మన అమరావతి కలల రాజధాని నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మించుకొందామని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా శివాలయంలోని పురోహితులకు డాక్టర్ మనోజ్ సన్మానం చేశారు.