The Desk…Mudinepalli :  అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు… సింగరాయపాలెం సచివాలయ సిబ్బంది మేము సైతం అంటూ..

The Desk…Mudinepalli : అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు… సింగరాయపాలెం సచివాలయ సిబ్బంది మేము సైతం అంటూ..

🔴 ఏలూరు జిల్లా : కైకలూరు నియోజకవర్గం : సింగరాయపాలెం : ది డెస్క్ :

అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమంలో భాగంగా.. సింగరాయపాలెం గ్రామంలోని సచివాలయంనందు… అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యులగుటకై ఒక్కొక్కరు 116/- రూపాయలు ఫోన్ పే రూపంలో CRDA అకౌంట్ కి చెల్లించారు.

సందర్భంగా అంబుల వైష్ణవి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ… అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం… వైష్ణవి పిలుపుమేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగస్తులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రతి ఒక్కరూ స్పందించి వారి యొక్క స్తోమత కొలది కనీసం 116 రూపాయలు చెల్లిస్తున్న విధానానికి సంతోషం వ్యక్తం చేస్తూ .. దీనిలో అందరూ పాలిభాగస్తులై ఉండాలని, మన అమరావతి కలల రాజధాని నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మించుకొందామని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సింగరాయపాలెం సచివాలయ సిబ్బందిని డాక్టర్ మనోజ్ సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.