The Desk…Mudinepalli : పేద వృద్ధురాలు రోజనమ్మ అంత్యక్రియలకు అంబుల వైష్ణవి సాయం

The Desk…Mudinepalli : పేద వృద్ధురాలు రోజనమ్మ అంత్యక్రియలకు అంబుల వైష్ణవి సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని సంకర్షణపురం గ్రామానికి చెందిన రేమల్లి డేవిడ్ రాజు భార్య రోజనమ్మ (75) కాలి ఎముక విరిగి గాయమై అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. పేద వృద్ధురాలు రోజానమ్మ ఒంటరిగా జీవిస్తోంది.

మరణ వార్త విషయం తెలియడంతో ముదినేపల్లికీ చెందిన ప్రముఖ ప్రయివేటు వైద్యుడు మనోజ్ కుమార్తె, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఆంబుల వైష్ణవి తన తండ్రి ద్వారా రొజానమ్మ దహన సంస్కారాలు నిమిత్తం రూ.5 వేలు అందజేశారు. సాయం అందించిన డా.మనోజ్, కుమార్తె వైష్ణవినీ స్థానికులు అభినందించారు.