ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK :
మండలంలోని పెద్దగోన్నూరు గ్రామం, విశ్వనాధుని పాలెంకు చెందిన దరెసెన జీవరత్నం గత కొద్ది రోజులుగా అనరోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందారు.
ముదినేపల్లికి చెందిన ప్రముఖ ప్రయివేటు వైద్యుడు మనోజ్ కుమార్తె, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఆంబుల వైష్ణవి కి విషయం తెలియడంతో తన తండ్రి ద్వారా జీవరత్నం దహన సంస్కారాలు నిమిత్తం రూ.5 వేలు బాధితుల కుటుంబానికి అందజేశారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. సాయం చేసిన డా.మనోజ్, కుమార్తె వైష్ణవికి బాధిత కుటంబం కృతజ్ఞతలు తెలిపింది.