కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.
అదేవిధంగా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నివారణలో భాగంగా.. ప్రతి శనివారం కలెక్టరేట్ కు ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ పై రావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ స్వయంగా కలెక్టరేట్ కు సైకిల్ పై వచ్చిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.

