The Desk…Machilipatnam : ఈనెల 17న అవనిగడ్డలో జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : ఈనెల 17న అవనిగడ్డలో జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.17.04.2025 గురువారం నాడు అవనిగడ్డలోని “ప్రభుత్వ డిగ్రీ కళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేసారు.

ఈ జాబ్ మేళాలో, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్,ఇన్నోవ్ సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, YSK ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బజాజ్ ఫిన్సర్వ్, కెఎల్ గ్రూప్, సుధీర్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్, పేటిఎమ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి. విక్టర్ బాబు మరియు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి.నరేష్ కుమార్ తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు పీజి పూర్తిచేసిన 18 నుండి 30 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి ఆసక్తికర వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, ఏప్రిల్ 17న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 63006 18985, 79955 34572 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.