🔴 ప.గో జిల్లా : పెంటపాడు మండలం : K పెంటపాడు : ది డెస్క్ :
కే.పెంటపాడు గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ” కార్యక్రమములో భాగంగా..
వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాలని, ప్రతి దినం ఉదయమే దీని విషయమై కొంత సమయం కేటాయించాలని..వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కలిగి , బహిరంగ మలవిసర్జన నిర్మూలించే దిశగా.. ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు , సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఎంపీటీసీ ఏడుకొండలు, HM రామకృష్ణ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

