The Desk…International : ఆంధ్రా కుర్రాడు – అరుదైన ఘనత

The Desk…International : ఆంధ్రా కుర్రాడు – అరుదైన ఘనత

🔴 అంతర్జాతీయo/ ది డెస్క్:

భరత్ అనే నేను..

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన పర్వతారోహకుడు భరత్ తమ్మినేని(36) అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 14 శిఖరాల్లో ఒకటైన చైనాలోని మౌంట్ చో ఒయు పర్వతాన్ని (8,188 మీ) అధిరోహించారు.

కాగా ఇప్పటికే ఆయన 8 అత్యంత ఎత్తైన పర్వతాలను విజయవంతంగా అధిరోహించినట్లు సమాచారం. తాజాగా మౌంట్ చో ఒయు (Mt Cho Oyu) పర్వతాన్ని ఎక్కి.. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలలో తొమ్మిదింటిని అధిరోహించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు భరత్ తమ్మినేని..

మే 2017లో మౌంట్ ఎవరెస్ట్..

సెప్టెంబర్ 2018లో మౌంట్ మనస్లు,

మే 2019లో మౌంట్ లోట్సే,

మార్చి 2022లో అన్నపూర్ణ,

ఏప్రిల్ 2022లో కాంచన్జంగా,

మే 2023లో మకాలు,

అక్టోబర్ 2024లో శిశాపాంగ్మా,

ఏప్రిల్ 2025లో మౌంట్ ధౌలగిరి….

తదితర 8,000 మీటర్లకు పైగా ఎత్తైన 2 (worlds highest 8,000metre peaks) అధిరోహించినట్లు అధికారులు పేర్కొన్నారు. మౌంట్ చో ఒయు పర్వతాన్ని అధిరోహించడానికి భరత్ సెప్టెంబర్ 30న చైనాలోని చో ఒయు బేస్ క్యాంప్ కు చేరుకున్నాడు.

అయితే ఆ సమయంలో అక్కడి ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం కారణంగా పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు విరమించుకోవాల్సి వచ్చింది. దీంతో నాటి నుంచి అక్కడే ఉన్నారు.

మంగళవారం ఉదయం 6.55గంటలకు ట్రెక్కింగ్ ప్రారంభించి, 8.55గంటలకు పర్వత శిఖరాన్ని చేరుకున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 14 శిఖరాల్లో తొమ్మిదింటిని విజయవంతంగా అధిరోహించి రికార్డు నెలకొల్పారు.