🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
వంగవీటి మోహనరంగా వర్ధంతి, బడేటి బుజ్జి విగ్రహావిష్కరణ సందర్బంగా విగ్రహాలకు కాపు సంక్షేమ సేవాసంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కాపుసంక్షేమ సేవాసంఘ వ్యవస్థాపక అద్యక్షులు పులి శ్రీరాములు మాట్లాడుతూ..పేదల హృదయాలలో చిరస్థాయిగా నిలచిన వంగవీటి మోహన రంగా వర్ధంతి డిసెంబర్ 26 నే బడేటి బుజ్జీ స్వర్గస్తులవటం , ఇద్దరు సరైన నాయకుల వర్ధంతి ఒకే రోజున రావటం యాదృచ్చికమైన సంఘటన అన్నారు.
కార్యక్రమంలో కాపుసంక్షేమ సేవాసంఘ నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్, వాసా రాజు,నడపన దాన భాస్కర్, మంచెం వెంకటేశ్వర రావు, దండిపాటి జగన్మోహన రావు, గంధం వెంకట రామకృష్ణ, రామిశెట్టి రామచంద్ర రావు, ఘంటా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.