The Desk… Eluru  : పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా➖ఎంపీ పుట్టా మహేష్

The Desk… Eluru : పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా➖ఎంపీ పుట్టా మహేష్

🔴 ‎ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్ :

డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన కంటెంట్ మరియు వాడకం నుండి పిల్లలను రక్షించడానికి అనేక చర్యలను చేపట్టినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.

సోషల్ మీడియా వాడకం పిల్లలపై, వారి మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు గురువారం లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం, 2000, పిల్లల డేటా రక్షణ (DPDP చట్టం, 2023), India AI మిషన్ కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన కంటెంట్  పిల్లలను రక్షించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

సోషల్ మీడియాలో హానికర కంటెంట్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ.. చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ ను పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నిరోధించాలని ఆదేశించినట్లు తెలిపారు.

సమాచార భద్రతలో మానవ వనరుల వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ భద్రత అంశాలపై సాధారణ అవగాహనను కల్పించడానికి ISEA పై MeitY ఒక ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 4,309 అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించబడ్డాయనీ, వీటిలో పాఠశాల/కళాశాలలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంస్థలు, ప్రభుత్వ సిబ్బంది మరియు సాధారణ ప్రజలు సహా 9.63 లక్షల మంది పాల్గొన్నారని, పాఠశాల పిల్లలు మరియు విద్యార్థుల కోసం 1,186 అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించబడ్డాయని కేంద్ర మంత్రి వివరించారు.

Social media has a serious impact on children.
➖MP Putta Mahesh.


Union Minister of State for Electronics and Information Technology Jitin Prasad said that several steps have been taken to protect children from harmful content and usage on digital and social media platforms. The Union Minister was replying to a question asked by Eluru MP Putta Mahesh Kumar in the Lok Sabha on Thursday on the impact of social media usage on children and their mental health. He revealed that several steps have been taken to protect children from harmful content on social media platforms under the Information Technology (IT) Act, 2000, the Protection of Children’s Data (DPDP Act, 2023), and the India AI Mission.

In response to another question from MP Putta Mahesh Kumar on the steps being taken to prevent the spread of harmful content on social media, the Union Minister said that social media platforms have been instructed to prevent the posting or sharing of content that violates the law. He said that MeitY is implementing a project on ISEA to create awareness on the precautions in the use of human resources in information security and general awareness on cyber security issues. The Union Minister explained that so far, 4,309 awareness workshops have been organized across the country, in which 9.63 lakh people including school/college students, teachers, institutions, government staff and general public participated, and 1,186 awareness workshops have been organized for school children and students.

‎‎జిల్లా కోర్టులో మౌలిక సదుపాయాలు :

‎ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకోసం గత 5 ఏళ్లలో 104.29 కోట్ల నిధులు విడుదల చేయగా, 94.23 కోట్లు విలువైన పనులు ఇప్పటికే పూర్తి చేసినట్లు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు . ఏలూరు సహా ఏపీ లోని జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు శుక్రవారం లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

2025-26 ఏడాదికి గాను 30.98 కోట్లు కేటాయించగా, 20.92 కోట్లు ఇప్పటికే వినియోగించినట్లు చెప్పిన కేంద్ర మంత్రి, మరో 10.06 కోట్ల విలువైన పనులు జరుగుతున్నట్లు వివరించారు.    జడ్జిల నివాస గృహాలు, కోర్టు భవనాల నిర్మాణం, ఇతర సదుపాయాల కోసం ఈ నిధులు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 1993-94 నుండి న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం  కేంద్ర ప్రాయోజిత పథకం (CSS)ను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 

‎ఏపీలో జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులలో ఖాళీలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులలో మొత్తం 84 జడ్జిల, న్యాయాధికారుల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఖాళీలు ఉన్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. కోర్టు హాళ్లు, న్యాయ అధికారుల నివాస యూనిట్లు, న్యాయవాదుల హాళ్లు, టాయిలెట్ కాంప్లెక్స్‌లు మరియు డిజిటల్ కంప్యూటర్ గదులు.
‎ఏలూరు జిల్లా కైకలూరు సహా 33 జిల్లా, సబార్డినేట్ కోర్టులలో మౌలిక సదుపాయాలు, నిర్మాణ పనులు పూర్తికాగా, మరో 12 కోర్టులలో పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.