ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొల్లేరు, తమ్మిలేరు అధికార సమీక్ష నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఏలూరు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ్మిలేరు పై.. ఏలూరు అమీనా పేట వద్ద కాజ్ వే పై ప్రతి వర్షాకాలంలో తమ్మిలేరు పొంగినప్పుడు.. కాజ్ వే ని మూసి వేయడం వలన శ్రీరామ్ నగర్.. శనివారపు పేట ..దుగ్గిరాల ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఎన్నికల సమయంలో ప్రజల కి ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి అత్యవసరం గా కాజ్ వే కి బదులుగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 15 కోట్ల రూపాయలు అవసరం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకెళ్లిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ..
వెంటనే ముఖ్యమంత్రి 15 కోట్ల రూపాయలను తక్షణమే మంజూరు చేసి.. టెండర్లు పిలచి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ..బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి కృషి చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని కలసి కృతజ్ఞతలు తెలిపిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్.