ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
నేడు (ఆదివారం) ఉదయం 9 గంటలకు ఏలూరు పైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవన్ లో ఎపిజెఎసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం. మధ్యాహ్నం 2.30 నుంచి ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జిల్లా ఛైర్మన్ కె.రమేష్కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎపిజెఎసి అమరావతి రాష్ట్ర కార్యవర్గం, సభ్య సంఘాల రాష్ట్ర న్యాయకత్వం, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొంటారని తెలిపారు.