ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : THE DESK NEWS :
గాలాయగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి 68వ వార్షికోత్సవాల 5వ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా… అమ్మవారు ప్రత్యేక అలంకరణ లో భక్తులకు దర్శనమిస్తున్నారు. 5వ రోజు సందర్భంగా, ఈ రోజు రాత్రి 9 గంటలకు అపూర్వమైన 4 అద్భుత ఘట్టాలు
1. మయసభ
2. రామాంజనేయ యుద్ధం (వార్ సీను ).
3. బాలనాగమ్మ(ఫకీరు సంగు లవ్ సీన్).
4. గయోపాఖ్యానం (వార్ సీన్) ఏర్పాటు చేయడం జరిగినది.
పెద్దఎత్తున కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొని… అమ్మవారి ఆశీర్వచనములు తీసుకోవలసిందిగా కోరుతున్నాము. ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు, మా గాలయగూడెం గ్రామము తరపున మరియు అచ్చమ్మ పేరంటాల తల్లి కమిటీ తరఫున ఆలయ కమిటీ సభ్యులు హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.