The Desk…Denduluru : దెందులూరులో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం

The Desk…Denduluru : దెందులూరులో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం

🔴 ఏలూరు జిల్లా : దెందులూరు మండలం : దుగ్గిరాల : ది డెస్క్ :

గ్రామంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని దుగ్గిరాల గ్రామపంచాయతీ కార్యదర్శి రాజా సాయికృష్ణ అన్నారు.

సోమవారం ‘హర్ ఘర్ తిరంగా‘ కార్యక్రమంలో భాగంగా దుగ్గిరాల పంచాయతీ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించి… సచివాలయ, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

కార్యక్రమంలో దుగ్గిరాల సర్పంచ్ గుంజా క్రీస్తుమణి, వైస్ సర్పంచ్ చింతమనేని శివగోపాల్ , పంచాయితీ కార్యదర్శి , పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.