🔴 పగో : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు రీజనల్ డైరెక్టర్ కమ్ రాజమహేంద్రవరం పురపాలక సంఘ విభాగాల అధిపతులు మరియు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంనందు ఆస్తిపన్ను వసూలు మరియు నీటి పన్ను వసూలు పట్టణంలోని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ మరియు పట్టణ పరిధిలోని షాపుల నుండి వసూలు చేసే D& O ట్రేడు లైసెన్స్ ఫీజు వసూళ్ల పై సమీక్షా సమావేశం నిర్వహించి పురపాలక సంఘ పరిధిలో ఇంకను విధించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మరియు కుళాయి పన్నులపై సర్వే నిర్వహించి తగుచర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు.

పన్నెతర వసూళ్లను సకాలంలో వసూలు చేసి పురపాలక సంఘం ఆదాయం పెంచుటకు పలు ఆదేశాలు జారీ చేసి, పురపాలక సంఘ పరిధిలో పారిశుధ్య పురోగతిపై సమీక్ష నిర్వహించి పట్టణంలో తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించి వాటిని 100% ప్రాసెస్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరియు ప్రజల నుండి వచ్చే PGRS మరియు పురమిత్ర ఫిర్యాదులను సకాలంలో సరైన పద్ధతులు పరిష్కరించవలసిందిగా సిబ్బంది అందరికీ ఆదేశాలు జారీ చేసారు.
ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ A. రాంబాబు మరియు మున్సిపల్ ఇంజనీరు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పలువురు పాల్గొన్నారు.

