పగో జిల్లా : భీమవరం :
స్వర్ణ నిధికి గూడపల్లి చెందిన పున్నం నూకరాజు షణ్ముఖ సూర్యదుర్గ దంపతులు లక్షా పది వేలు రూపాయలు విలువైన 8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం జ్ఞాపిక అందచేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు.

