🔴 పగో : భీమవరం :
సూర్య మానస పుత్రులుగా పిలవబడే స్వయంభు అర్కరిషి మహాగురువుచే షోడశ(16) రాత్రుల సవితృ వ్రత దీక్ష (రిషి మాల)ఈరోజు భీమవరంలో 25 మంది రిష్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో కలిపి సుమారు 70 మంది రిష్యులు మాలధారణ చేపట్టారు.
దీక్ష విరమణ దక్షిణాభిముఖంగా ఉన్న అతి ప్రాచీన ఏకైక సూర్య దేవాలయం, బూదగవి మహాపుణ్య క్షేత్రంలో రథసప్తమి పర్వదినాన జరుగును.
ఈ సందర్భంగా స్వయంభు అర్క రిషి మహాగురువు రిష్యులకు(దీక్షా దారులకు), శిష్యులకు లోక కళ్యాణార్థం శుభాశీస్సులు తెలిపారు.

