The Desk… Amaravati : కూటమి ప్రభుత్వంతో రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి : మంత్రి నాదెండ్ల

The Desk… Amaravati : కూటమి ప్రభుత్వంతో రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి : మంత్రి నాదెండ్ల

🔴 గుంటూరు జిల్లా : అమరావతి : THE DESK NEWS :

ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

ఆదివారం నాటికి 27లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామని చెప్పారు.

ధాన్యం సేకరణపై మంత్రి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

‘‘4,15,066 మంది రైతుల నుంచి ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరించాం..

వైకాపా హయాంలో కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ధాన్యం కొన్నారు..

ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం..

రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.6,083.69 కోట్లు జమ చేశాం..

వైకాపా హయాంలో ధాన్యం డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేదు..

రైతుల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందడి తెచ్చింది’’ అని నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.