అమరావతి : అసెంబ్లీ : THE DESK :
ఏపి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు ను రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం అసెంబ్లీలో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, పలువురు నేతలు కలసి ఆయనను తమ వెంట తీసుకుని వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.