- రెండు లక్షల నగదు +13 కాసుల1/4 బంగారం నగలు స్వాధీనం
🔴 కాకినాడ జిల్లా : ది డెస్క్ :
ఆటోలో – బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలు..‼️
మహిళా ప్రయాణికులే టార్గెట్
గత నెల కత్తిపూడిలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ హ్యాండ్ బ్యాగ్ లో రెండు లక్షల నగదు దొంగించబడిన కేసులో కాకినాడ జిల్లా ఎస్పీ స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో..
పెద్దాపురం డి.ఎస్.పి పర్యవేక్షణలో.. ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో..
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి .. తొండ శాంతి (35), భూలక్ష్మి (38) అనే ఇద్దరు మహిళా దొంగలను అదుపులోకి తీసుకొని విచారించగా..అన్నవరం, రౌతులపూడి, ప్రతిపాడు, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ల నందు నమోదు కాబడిన కేసులలో వీరి హస్తము ఉన్నట్లు నిర్ధారణ అయ్యి … రికవరీ చేయగా రెండు లక్షల నగదు + 106 న్నర గ్రాముల బంగారం వస్తువులను స్వాధీనం చేసుకుని సదరు మహిళలను రిమాండ్ కి తరలించిన పోలీసులు.
ప్రత్తిపాడు పోలీస్ వారి హెచ్చరిక : ప్రజలు బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు పక్కన వున్న ప్రయాణికుల పట్ల జాగ్రత్త వహించాలని… ముక్యంగా ప్రబుత్వం వారు ప్రవేసపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు పదకం ద్వారా ప్రయాణం చేయు మహిళలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి.
➖ సూర్య అప్పారావు (ప్రత్తిపాడు సిఐ)